– జనాలను బురిడీ కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్లు ….
– కేటుగాళ్లు చేతిలో రక్షణ శాఖ విఫలం ….
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : ప్రజలను, వారి ఆస్తులను రక్షించేందుకు ప్రభుత్వ రక్షణ శాఖ సైబర్/ కేటుగాళ్లు చేతిలో విఫలమవుతోంది. రోజుకో కొత్త ఐడియా తో ఎక్కడో దగ్గర సైబర్ నేరాలు జరుగుతూనే వున్నాయి. ఎవరో తెలియని వ్యక్తి వచ్చి.. తన ఫోన్ పాడయ్యిందని లేదా బ్యాలెన్స్ లేదని.. తన ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కు కాల్ చేయాలని మన ఫోన్ అడిగితే.. అయ్యో అని వెంటనే ఇచ్చేస్తాం.
మనకు తెలియకుండానే క్షణాల్లో ఆ ఫోన్ కాల్ ఫార్వార్డింగ్, మెసేజ్ ఫార్వార్డింగ్ ఆప్షన్ను వారు మార్చేస్తారు. జస్ట్.. ఫోన్ కీ ప్యాడ్ మీద 401 అని టైప్ చేసి వాళ్ల ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి డయల్ చేస్తారు. అంతే.. ఇలా చేస్తే మనకు తెలియకుండానే మన కాల్స్, మెసేజెస్ అన్నీ కూడా ఆ నంబర్కు ఫార్వర్డ్ అవుతుంటాయి. దీనివల్ల మన నార్మల్ మెసేజెస్ మాత్రమే కాకుండా.. మన యూ.పి.ఐ
బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన అన్ని ఓటీపీలు కూడా ఆ నెంబర్కు ఫార్వర్డ్ అవుతాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.