విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా ) : రాష్ట్ర ప్రభుత్వం
విద్యా దీవెన కింద తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ నగదును చాలా మంది కాలేజీలకు చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారు. దీంతో తల్లులకు నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. తల్లుల ఖాతాలో
నగదు జమ అయిన 7 రోజుల్లోపు చెల్లించని వారికి.. తదుపరి విడత మొత్తం కళాశాలలకే జమ చేస్తామంది. ఫీజు కట్టకపోయినా, కట్టినట్లు తప్పుడు సమాచారమిస్తే చర్యలు తీసుకుంటామంది.