విశాలాంధ్ర – చోడవరం : చోడవరం పతంజలి యోగ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఉషోదయ కళాశాల నందు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించినట్లు చోడవరం పతంజలి యోగా శిక్షణ కేంద్రం యోగ గురువు పుల్లేటి సతీష్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి యోగా శిక్షణ కేంద్ర అధ్యక్షులు పసుమర్తి అశోక్ జ్యోతి ప్రజ్వలన చేయగా డాక్టర్ బంగారు కృష్ణ పతంజలి గురువుగారు చిత్రపటానికి పూలమాలలు వేశారు. జాతీయ అంతర్జాతీయ యోగా పోటీల్లో పథకాలు సాధించిన విద్యార్థులు చేత కష్టమైన ఆసనాలు చేయించారు యోగ గురువు పుల్లేటి సతీష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చిన్న వయసు నుండే యోగాను ఆచరించడం ద్వారా శారీరకంగా మానసికంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి యోగ దివ్య ఔషధం అని తెలియజేస్తూ యోగా కేంద్రం స్థాపించి 20 సంవత్సరాల నుండి చోడవరం పరిసర ప్రాంతంలో ఎంతో మందికి యోగ విద్యను నేర్పించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుటకు నా వంతుగా నిరంతరం ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు
ఈ కార్యక్రమంలో యోగ టీచర్స్ బోగవిల్లి గణేష్ కొట్టాపు హరి కిరణ్ పసుమర్తి నానాజీ తర్రా మురళి సూర్యనారాయణ సంతోష్ విశ్వేశ్వరరావు, పద్మజ టీచరు యోగా కేంద్ర సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు.