– ఇండియా కూటమి అభ్యర్ధి జగతా శ్రీనివాసరావు ….
విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా ) : తే.09.05.2024ది. గ్రామాల్లో ఉపాధి వలసలు నివారించి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు జాతీయ కాంగ్రెస్ తోనే సాధ్యమని ఇండియా కూటమి జాతీయ కాంగ్రెస్ పార్టీ చోడవరం ఎమ్మెల్యే అభ్యర్ధి జగతా శ్రీనివాసరావు అన్నారు. నియోజకవర్గం లోని రోలుగుంట మండలం లో దిబ్బలపాలెం, అడ్డసారం గ్రామాలలో గురువారం ఎన్నికల విస్తృత ప్రసారం చేశారు. అడ్డసారం గ్రామం లో ఉపాధి కూలీలను కలిసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ను ప్రజలకు వివరించారు. యువత కు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావాలన్నారు. అలాగే గ్రామాల్లో ఉపాధి వలసలు నివారించాలన్నా, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నను, మహిళా సాధికారిత సాధించాలన్న కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తేనే సాధ్యం అని జగతా శ్రీనివాస్ గారూ తెలియజేయడం జరిగింది.