విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : తే08.02.2024ది. జాతీయ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల రెడ్డి ఈనెల పదో తేదీన నర్సీపట్నం నియోజకవర్గంలో పర్యటించనున్నారని ఏపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి గూనూరు వెంకట్రావు తెలియజేశారు. చోడవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గూనూరు వెంకటరావు మాట్లాడుతూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి ఈనెల పదవ తేదీన నర్సీపట్నం నియోజకవర్గంలో నాతవరం మండలం మునగపాడు గ్రామంలో పర్యటిస్తున్నారని తెలియజేసారు. షర్మిలా రెడ్డి పర్యటనకు భద్రత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. దేశంలోను, రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ మతతత్వ చాందస వాదాన్ని పెంచి పోషిస్తోందన్నారు. తెల్ల దొరల గుప్పెట్లో ఉన్న దేశాన్ని స్వతంత్రంగా నడిపించినటువంటి ఘన చరిత్ర గల జాతీయ కాంగ్రెస్ ను బలపరచవలసిందిగా కోరారు. తాగునీరు వాయి కాలుష్యంతో చోడవరం నియోజకవర్గంలో రోలుగుంట నుంచి వెంకన్నపాలెం వరకు ప్రజలు అనేకమంది ఎముకలు వ్యాధులు బారిన పడుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు భద్రత నిమిత్తం 360 కోట్లు ఖర్చు చేసారని గుర్తుచేస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి భద్రత గురించి మంత్రులు దృష్టికి తీసుకు వెళ్తే స్వతంత్రంగా భద్రత ఏర్పాటు చేసుకోవాలని సూచించారన్నారు. రాష్ట్రంలో అధికారంలో వైసిపి పార్టీ ఉన్నప్పటికీ, బిజెపి ప్రధాని మోడీ చెప్పు చేతల్లోనే నడుస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినేత్రి షర్మిలారెడ్డి పర్యటన విజయవంతం చేయవలసిందిగా పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ అభిమానులను ఆయన కోరారు.