విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా): తే. 02.02. 2024ది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేస్తున్న మహిళా కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు గూనూరు వరలక్ష్మి ఆధ్వర్యంలో మహిళా కార్మికులు శుక్రవారం చోడవరం ఎమ్మార్సి వద్ద ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మెనూ చార్జీలు 20 రూపాయలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత తో పాటు కనీస సెలవులు, యూనిఫామ్ ఇవ్వాలని కోరారు. మహిళా కార్మికులకు మెటర్నిటీ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. వంట గ్యాసు ప్రభుత్వమే సరఫరా చేయాలని మధ్యాహ్న భోజన0 వండేందుకు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ మేరకు ఎంఈఓ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్. బుచ్చి రాజమ్మ, రూపవతి తదితరులు పాల్గొన్నారు.