విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.13.05.2024ది. చోడవరం (26)లో సోమవారం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో లక్ష్మీపురం పోలింగ్ కేంద్రం 186 లో ఈ.వి.ఎం.లు మొరాయించినట్లు అధికారులు తెలిపారు. ఓటింగ్ ప్రారంభించిన కొంత సమయానికి ఈ.వి.ఎం.లు పనిచేయకపోవడంతో కాస్త ఉత్తంకంట మొదలైంది. తక్షణమే పోలింగ్ అధికారి మరో ఈ.వి.ఎం ఏర్పాటు చేయడంతో ఓటర్లు ఊపిరి పీల్చుకున్నారు.