Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

గళమెత్తిన బ్రాహ్మణ శంఖారావం

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.10. 02. 2024ది. గతంలో బ్రాహ్మణులకు మేలు చేసిన ప్రభుత్వాలకే నాయకత్వ0, అధికారం కట్టబెట్టాలని బ్రాహ్మణ శంఖారావం లో ఐక్యంగా గళమెత్తారు. బ్రాహ్మణ సంఘం ఆర్బిఎస్ ఉపాధ్యక్షుడు ఎం.విస్సు అధ్యక్షతన చోడవరం గంగా ఫంక్షన్ హాల్ లో శనివారం నిర్వహించిన బ్రాహ్మణ శంఖారావం సభకు బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య, పురుషోత్తమ రాజు, స్థానిక మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో వేమూరి ఆనంద సూర్య మాట్లాడుతూ 2014లో గత తెలుగుదేశం ప్రభుత్వం బ్రాహ్మణులను ఆదుకునేందుకు సుమారు 500 కోట్ల రూపాయలు నిధులతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పరిచి కశ్యప, గరుడ, విద్యా భారతి, తదితర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలియజేశారు. బ్రాహ్మణుల ఔన్నత్యానికి గుర్తుగా మాజీ ప్రధాని దివంగత నేత పి.వి. నరసింహారావు, ఎంఎస్ స్వామినాథన్ ల కు భారతరత్న అవార్డులను అందజేసిన ప్రధాని నరేంద్ర మోదికు బ్రాహ్మణుల అందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వాలు చేసిన సంక్షేమ పథకాలను తొక్కిపెట్టి బ్రాహ్మణ వ్యతిరేకిగా మారిన ప్రస్తుత సీ.ఎం. జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ కో ఆర్డినేటర్ కొమ్మనమంచి నరసింహమూర్తి మాట్లాడుతూ బ్రాహ్మణులను అన్ని విధాల ఆదుకున్న మాజీ సి.ఎం. చంద్రబాబు నాయుడుకే తిరిగి అధికారం కట్టబెట్టాలని, ఈ దిశలో బ్రాహ్మణులంతా ఐకమత్యంతో కృషి చేయాలన్నారు. టి.డి.పి, జనసేన అధికారంలో నే రానున్న ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందుకోవాలని సూచించారు. శాఖలు, వర్గ బేధాలు లేకుండా బ్రాహ్మణులు, ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే వారినే తిరిగి ఎన్నుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో అధికారుల కాళిదాసు, రామలింగ శాస్త్రి, వింజమూరి శంకర్, గుంటూరు సత్య నారాయణ, ఉపాధ్యాయుల శ్రీనివాసరావు, అందుకూరి కిరణ్, బైరా ఫౌండేషన్ అధినేత సోదరుడు బ్రహ్మనాయుడు చోడవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ బత్తుల తాతయ్య బాబు, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూనూరు మల్లు నాయుడు, గోటేటి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img