విశాలాంధ్ర – తాడిపత్రి : ఆంధ్రప్రదేశ్ ముస్లిం స్వర్ణకార సంఘం రాష్ట్ర ఎన్నికలలో తాను రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని తనను గెలిపించాలని ఇస్మాయిల్ ఖాదిరి సాబ్ స్వర్ణకారులను కోరారు.తాడిపత్రి పట్టణానికి ప్రచారానికి విచ్చేసిన ఆయనను స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఇస్మాయిల్ ఖాద్రి సాబ్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణకారుల వృద్ధి కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను అన్నారు. కావున ప్రతి ఒక్క స్వర్ణకారుడు తమ అమూల్యమైన ఓటును పట్టకర గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు. ఈ కార్య క్రమంలో స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్ స్వర్ణకారులు సలీం, షబ్బీర్, ఖాజా, వలి,షఫీ, ఇమామ్, సదకు స్వర్ణకారులు పాల్గొన్నారు.