విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం డిఎస్పి జనార్దన్ నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎవరైనా గొడవలు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్, 30యాక్ట్ అమల్లో ఉన్నందున గుంపులు, గుంపులుగా ఉండకూడదన్నారు. కౌంటింగ్ రోజు ఎవరి ఇంటికి వారు పరిమితం కావాలన్నారు.
ఎలక్షన్ల రోజు జరిగిన గొడవలను దృష్టిలో ఉంచుకొని అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. కౌంటింగ్ అనంతరం గెలిచిన అభ్యర్థులు మూడు రోజుల వరకు క్రాకర్స్ కాల్చడం, ర్యాలీలు చేయడం నిషేధం అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ మద్యం షాపులు 4 5వ తేదీలలో తెరవపడవని చెప్పారు. వాట్సాప్ గ్రూప్ లలో ఇతరులను కించపరిచే విధంగా పోస్టులు పెట్టరాదు. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు జిల్లాలో కౌంటింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లకూడదు. 13, 14వ తారీకు జరిగిన అల్లర్లలో 212 మందిని రౌడీ షీటర్ లుగా నమోదు చేశామన్నారు. అలాగే 133 మందిని రిమాండ్ కు పంపమన్నారు. గ్రామాలలో అల్లర్లకు పాల్పడితే గ్రామ బహిష్కరణ చేస్తామన్నారు. తాడిపత్రి పట్టణం చుట్టూ ఏడు చెక్ పోస్టులతో నిఘా ఉంచామన్నారు.తాడిపత్రి లో 467 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.