Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బాధ్యులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి

భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీస్ ఉన్నతాధికారులు చూడాలి
విశాలాంధ్ర -బత్తలపల్లి : రాప్తాడు వద్ద నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైకాపా మూకలు దాడి చేయడం అత్యంత దుర్మార్గపు చర్య.పిరికిపందల చర్య అని తెదేపా నాయకులు ఖండించారు. సోమవారం బత్తలపల్లి లోని స్థానిక మండల పార్టీ కార్యాలయంలో నియోజవర్గం తెలుగు రైతు అధ్యక్షుడు చల్లా శ్రీనివాసులు, జక్కంపూట్టి నాగభూషణ, విశ్రాంత ఉపాధ్యాయుడు చంద్రశేఖర్, మాదినేని చెన్నకేశవులు, మండల తెలుగు యువత అధ్యక్షుడు కమతం మోహన్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు నారాయణస్వామి, రమేష్ బాబు, తుమ్మలసూరి తదితరులు మాట్లాడుతూ విది నిర్వహణలో ఉన్న పోటో గ్రాఫర్ పై దాడి చేయడం అత్యంత బాధాకరం అన్నారు. భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసులు కేసు నమోదు చేసి నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాత్రికేయులు, ఫోటోగ్రాఫర్లు తమ సంస్థలు చెప్పిన ప్రకారం నడుచుకుంటారని కానీ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాలను నిర్భయంగా బయటకు వెళుతున్న పత్రిక పాత్రికేయులపై దాడి చేయడం ప్రభుత్వ చర్య అన్నారు. ఫోటోగ్రాఫర్ కు సీఎం జగన్ క్షమాపణ చెప్పి గట్టిగా చర్యలు తీసుకునే విధంగా ఆదేశించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుగా తమ వృత్తి ధర్మంలో భాగంగా రాజకీయ బహిరంగ సభలలో పాల్గొంటుంటారు. జర్నలిజం వారి వృత్తి , దానిని రాజకీయ కోణంలో చూడడం సరికాదు . పని చేసే ఉద్యోగులపై దాడి చేయడం ఏ మాత్రం మంచిది కాదు. భవిష్యత్ లో ఇలాంటి దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ పై ఉందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img