విశాలాంధ్ర – ధర్మవరం : వి ఎస్ వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరుగుల రాణి ప్రత్యూషకు ఫౌండేషన్ సభ్యులు జిఎస్బి ఫంక్షన్ హాల్లో గురువారం వెంకటనారాయణ, వేణుగోపాల్, శ్రీధర్, రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం, హెర్ఫోర్స్మెంట్ ఆర్డిటి రాజారావు, ఎడి రమేష్, బాలాజీ నాయక్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వెంకటనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం సిఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మారుమూల గ్రామం ఒక సాధారణ కుటుంబం నుంచి చెలిమి మోహనా కుమార్తె ప్రత్యూష అథెటిక్స్ పరుగు పందెం పోటీలలో జిల్లా సాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎదిగి, ఒరిస్సాలో జరిగిన నేషనల్ అథత్లిక్స్ పోటీలలో పాల్గొని, బంగారు పతకం సాధించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ పోటీలలో పాల్గొనడానికి చైనాలో జరిగే ఈనెల 28వ తేదీ నుంచి ఆ క్రీడాకారునికి అవకాశం రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఎన్ఫోర్స్మెంట్ ఆర్ డి డి రాజారావు మాట్లాడుతూ ఒక సాధారణ చేనేత కుటుంబంలో జన్మించి జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయికి అలాగే ఇంటర్నేషనల్ పోటీలలో పాల్గొనడానికి వెళుతున్న ప్రత్యూష మరెన్నో పథకాలను సాధించాలని వారు తెలిపారు. తదుపరి ముఖ్య అతిథుల సమక్షంలో పరుగుల రాణి ప్రత్యూషను ఘనంగా సన్మానిస్తూ వి ఎస్ వి ఫౌండేషన్ బాలాజీ నాయక్ తరఫున 15వేల రూపాయలు అలాగే ఆర్ డి డి తరఫున రూ.10,116 నగదును చిరు కానుకగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్లప్ప, వెంకటస్వామి, విజయభాస్కర్, నవీన్, రాజా, ఆక్కులప్ప తదితరులు పాల్గొన్నారు.