కౌన్సిలర్ కోటిరెడ్డి సుజాత
విశాలాంధ్ర – ధర్మవరం : గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పౌష్టిక ఆహారం ఎంతో ఉపయోగకరంగా ఉండటమే కాకుండా చక్కటి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందని 29వ వార్డు కౌన్సిలర్ కోటిరెడ్డి సుజాత, అవార్డు ఇన్చార్జ్ బాల్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం సుందరయ్య నగర్ అంగన్వాడి సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహార సామాగ్రిని బాలింతలకు గర్భవతులకు వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిడిపిఓ లక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలలో అన్ని మౌలిక సౌకర్యాలతో పాటు, ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా కల్పిస్తున్నామని తెలిపారు. గర్భిణీ స్త్రీలు బాలింతలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలను వహించాలని, నిర్లక్ష్యంగా ఉండరాదని తెలిపారు. అవసరమైతే తగిన వైద్య చికిత్సల కొరకు పట్టణ ఆరోగ్య కేంద్రాల వద్దకు గాని, ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద గాని వైద్య చికిత్సలను పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, మహిళా పోలీస్ మాధవి తదితరులు పాల్గొన్నారు.