Monday, May 20, 2024
Monday, May 20, 2024

సజావుగా జరిగిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ

రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి

విశాలాంధ్ర – ధర్మవరం : పోస్టల్ బ్యాలెట్ ఓటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవడం జరిగిందని ఈ ప్రక్రియ సజావుగా కొనసాగించడం జరిగిందని రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని సంజయ్ నగర్ లో బిఎస్ఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటును రెండవ రోజు విధిగా కొనసాగించారు. ఎన్నికల విధులలో ఉన్న వారికి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వరకు పోలీసుల పహారా మధ్య సజావుగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జరిగిందని తెలిపారు. ఇందులో ధర్మవరం నియోజకవర్గం లో ఎన్నికల విధులలో ఉంటు 454 మంది, ధర్మవరం నియోజకవర్గంలో పనిచేస్తూ ఇతర నియోజకవర్గంలోని వారు 97 మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకోవడం జరిగిందని తెలిపారు. . ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, ఉప ఎన్నికల తాసిల్దార్ షణ్ముఖ యాదవ్, ఎన్నికల అధికారులు, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img