విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని మున్సిపల్ ప్రకాశం హై స్కూల్ లో చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో మిత్రు అందరూ కలుసుకొని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకొని ఆనందించారు. మరల వారి కుటుంబ యోగక్షేమాలను ఒకరికి ఒకరు అడిగి తెలుసుకున్నారు. మిత్రులు అందరూ కలిసి ఎవరికైనా ఏ సమస్య వచ్చినా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నారు. అనంతరం మిత్రుడు ఆపద్బాంధవుడు ఉద్యోగ రీత్యా యూఎస్ లో ఉంటూ పట్టణంలో ఉండే పేద, బడుగు వర్గాల ప్రజలకు ఏ ఇబ్బంది కలిగిన తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఎన్నారై కిరణ్ కుమార్ ని ఘనంగా సన్మానించారు.
మైదుకూరు ఆంజనేయులు, రమణ, నరేష్ ,రవి ,రాజేష్ దగ్గు శ్రీనివాసులు , అలీ అక్బర్, జిలాన్, కృష్ణ, ఆది నారాయణ, రామచంద్ర, వీరయ్య, మధు, ప్రభాకర్, శివ, దాదు, కుల్లాయప్ప, రంగ, రామయ్య, సుబ్బారాయుడు, గోపి, భాస్కర్ పాల్గొన్నారు.