విశాలాంధ్ర – ధర్మవరం:: పట్టణంలోని మారుతీ నగర్ కు చెందిన వరప్రసాద్ (30) అనే చేనేత కార్మికుడు రైలు కింద మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి… మృతుడు వరప్రసాద్ బీటెక్ చదువు పూర్తి చేసుకుని పట్టణములో మరమగాలను నేస్తూ జీవనం కొనసాగించేవాడు. అయితే మగ్గాల ద్వారా నేసిన చీరలకు అన్ సీజన్ వల్ల సరిగా అమ్ముడుపోక నష్టం రావడం వల్ల మనస్థాపానికి గురై, పట్టణంలోని గుట్ట కింద పల్లి వద్దగల రైల్వే ట్రాక్ మీద రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. బీటెక్ చదివినా కూడా ఉద్యోగం రాకపోవడంతో, కుటుంబ పోషణ నిమిత్తం మరమగ్గల నేస్తూ జీవించేవాడు. మృతునికి ఒక కూతురు, భార్య మమత కూడా ఉన్నారు. ఈ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని మారుతీ నగర్ ప్రజలు, కుటుంబ బంధుమిత్రులు కోరుతున్నారు. ధర్మవరం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, సవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని, కుటుంబ సభ్యులకు అందజేశారు.