విశాలాంధ్ర -రాయదుర్గం : రాయదుర్గం పట్టణంలోని సెయింట్ థామస్ పాఠశాలలో విద్యార్థినిపై అమానుషంగా చితకబాదిన ఉపాధ్యాయుడు పై చర్యలు చేపట్టాలని.ఏ ఐ ఎస్ ఎఫ్. ఏఐవైఎఫ్ యువజన సంఘాలు విద్యార్థిని చితకబాదిన టీచర్ ని సస్పెండ్ చేయాలని తల్లీ తండ్రుల సమక్షంలో స్కూల్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రాయదుర్గం తాలూకా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు అంజి ఈ ఐ వై ఎఫ్ తాలూకా కార్యదర్శి కోట్రెష్ మాట్లాడుతూ. నర్సరీ చదువుతున్న విద్యార్థిపై అమానుషంగా ప్రవర్తిస్తు చితకబాధడం.ఆ విద్యార్థి భయభ్రాంతులకు గురి అయ్యి పరిస్థితి ఏర్పడిందన్నారు విద్యార్థి తల్లిదండ్రులు ఆస్పత్రికి చికిత్స అనంతరం పాఠశాలకు వెళ్లి విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థినీ ఎందుకు చితకబాదినారు అని అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరించడం పాఠశాల యజమానం నిర్లక్ష్యం అన్నారు పాఠశాల సమయంలో సమయపాలన టీచర్లు ఉండరు అని తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు సెయింట్ థామస్ స్కూల్ లో చితకబాదిన ఉపాధ్యాయుని వెంటనే విధుల నుండి తొలగించాలని విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు వైద్యం ఖర్చులు అతడే భరించాలని నినాదాలు చేశారు ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని స్కూల్ యాజమాన్యానికి తెలియజేశారు విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లలో చాలామంది వారి కష్టార్జితం మొత్తం విద్యార్థుల చదువు కోసం వేచించి మంచి విద్య అందించాలని వారి తాపత్రయం పడుతుంటే స్కూళ్లలో విద్యార్థులకు సరైన చదువులు అందించకు పోవడం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు విద్యార్థులు అల్లరి చేస్తే ఓర్పుతో సహనంతో ఉపాధ్యాయులు వారు చేసే అల్లరి పట్ల సైతం మమేకమై విద్యార్థిని విద్యార్థులకు క్రమశిక్షణ చదువును నేర్పాల్సిన బాధ్యత ఉంటుంది కానీ ప్రైవేట్ స్కూళ్లలో మాత్రం విద్యార్థులను చితకబాదుతు వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు వెంటనే సెయింట్ థామస్ స్కూల్లో విద్యార్థుల పై అమానుషంగా ప్రవర్తిచిన ఉపాధ్యాయుడు పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో. ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షుడు కుమార్ నాయక్ ఏఐఎస్ఎఫ్ నాయకులు నవనిత్ అరవింద్ ఏఐవైఎఫ్ నాయకులు అనీల్ కుమార్ జోసెఫ్ విద్యార్థిని తల్లిదండ్రులు తదితరులు తదితరులు పాల్గొన్నారు