Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

మైనార్టీ భూమిని కబ్జా చేసిన వైఎస్ఆర్సిపి నాయకుడు వడ్డే వేణు పై చర్యలు తీసుకోవాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం శింగనమల మండలం ఆకులేడు గ్రామానికి సంబంధించిన 12.47 ఎకరాల భూమిని బినామీ పేర్లతో వైకాపా ఎమ్మెల్యే అనుచరుడు వడ్డే వేణు కబ్జా చేశారని సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద బాధితుడు కనుముక్కల దస్తగిరి న్యాయం కోసం స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడంతో సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ ) జిల్లా అధ్యక్షుడు జి చిరంజీవి మద్దతు పలికారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ… కలెక్టరేట్ ఆఫీస్ గేటు దగ్గర బ్యానర్ను పెట్టుకొని గత మూడు రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గపు చర్య అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా మైనార్టీల పైన బడుగు ,బలహీన వర్గాల పైన వైయస్సార్సీపి నాయకులు దాడులు, అలాగే భూకబ్జాలు చేస్తున్నారని ,ఈ వైఎస్సార్ ప్రభుత్వం వారి ఆగడాలను సమర్థించుకుంటూ పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నదని దుయ్యబట్టారు. బాధితుడికి న్యాయం చేసేంతవరకు పోరాటం చేస్తామన్నారు. అధికారులు వెంటనే స్పందించాలని లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ ) జిల్లా అధ్యక్షుడు జి చిరంజీవి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆనంద్ కుమార్ సంతోష్ కుమార్ నగర కార్యదర్శి మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img