పూజారి గుంజర మహేష్, బయన్న
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణములోని గుట్టకిందపల్లి లో గల అక్కమ్మ గార్ల పరుష మహోత్సవ వేడుకలు గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఘనంగా నిర్వహించామనీ పూజారి గుంజర మహేష్, బయన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో గురువారం మాట్లాడుతూ అమ్మవారి పరుష కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు, భక్తాదుల సహాయ సహకారాలతో విజయవంతం చేయడం జరిగిందన్నారు.ఉదయం 6 గంటలకు అమ్మవారిని జలదికి పోవుట, తొమ్మిది గంటలకు జలదియందు పంచామృత అభిషేకాలు,, పుణ్యాహవాచనం,శ్రీ సూక్తా పారాయణం అర్చకులు చే నిర్వహించామని తెలిపారు.అనంతరం 10 గంటలకు వడి నింపు కార్యక్రమం తో పాటు మధ్యాహ్నం మూడు గంటలకు అమ్మవారిని పురవీధులకుండా గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించామన్నారు.అంతేకాకుండా ఈ వేడుకల సందర్భంగా మధ్యాహ్నం అన్నదాన దాదాపు 1000 మంది దాకా భక్తాదులు రావడం జరిగిందన్నారు. ఈ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించినందుకు ఆలయ కమిటీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు.