Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

కర్ణాటక రాష్ట్ర తైక్వాండో పోటీలలో అనంతపురం జిల్లా రెఫరీలు

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : అనంతపురం జిల్లాకు చెందిన తులసీరామ్, రామాంజినేయులు, కేశవయ్య, వెంకటేశులు అనే నలుగురు సీనియర్ తైక్వాండో క్రీడాకారులు నేటి నుంచి బెంగళూరు శ్రీ సాయి ప్యాలస్ కన్వెన్షన్ హాల్ నందు జరుగు కర్ణాటక రాష్ట్ర తైక్వాండో పోటీలలో టెక్నికల్ అధికారులుగా విధులు నిర్వర్తించేందుకు ఎంపిక కావడం జరిగింది. వీరు ఈనెల 23, 24 తేదీలలో జరుగు రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలలో రెఫరీలుగా సేవలు అందిస్తారు. ఎంపికైన వీరిని అనంతపురం జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు గురుస్వామి, సీనియర్ కోచ్ శాంతరాజ్, క్రీడాకారులు, అసోసియేషన్ సభ్యులు అభినందించడం జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img