విశాలాంధ్ర – శెట్టూరు : తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత 30 రోజులుగా అంగన్వాడి సిబ్బంది వివిధ రూపంలో లో సమ్మె చేస్తున్నారు. అయితే ప్రభుత్వం సమ్మెను నిషేధిస్తూ తీసుకొచ్చిన జీవో నెంబర్ 2 (ఎస్మా ) కాపీలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ బుధవారం శెట్టూరు తహసిల్దార్ కార్యాలయం లో పంగనామం దిద్దుకుంటూ నిరసన చేపట్టారు మండల అధ్యక్షులు అపర్ణ మాట్లాడుతూ మా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దాదాపుగా 30 రోజులు వివిధ రూపంలో ఆందోళన చేపడుతున్న ప్రభుత్వం మాత్రం అంగన్వాడీ సిబ్బంది పైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విధానం సరైంది కాదని మా సమస్యలు పరిష్కరించ లేనప్పుడు రాష్ట్ర యూనియన్ పిలుపుమేరకు ఆమ నిరాహార దీక్ష చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు
తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించేంత వరకు కూడా తాము సమ్మెను కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్రాక్షాయిని, సరస్వతి, భీమక్క, గౌరీ, గంగా దేవి, అంజినమ్మ వన్నూరక్క నాగలక్ష్మి శారదమ్మ, సుజాతమ్మ, విశాలాక్షి, తదితరులు పాల్గొన్నారు