జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్
విశాలాంధ్ర అనంతపురం వైద్యం : అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, సమగ్ర శిక్ష ఏపిసి వరప్రసాద్, ఆర్డీఓ జి.వెంకటేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 287 అర్జీలను జాయింట్ కలెక్టర్ స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ అర్జీలను గడువులోపు ఎలాంటి పెండింగ్ ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీలకు నాణ్యతగా పరిష్కారం చూపించాలని, సకాలంలో అర్జీలను పరిష్కరించడం అత్యంత ముఖ్యమన్నారు. అర్జీల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. ప్రతినిత్యం మానిటర్ చేస్తూ అర్జీలకు పరిష్కారం చూపించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎలాంటి రీఓపెన్ కాకుండా అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగరాజారావు, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేంద్ర, వెప్మా పీడీ విజయలక్ష్మి, బీసీ వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఇహషాన్ బాషా, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదన్ రావు, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రసూల్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వరరావు, హార్టికల్చర్ డిడి రఘునాథ రెడ్డి, ఏపీఎంఐపి పిడి ఫిరోజ్ ఖాన్, మార్కెటింగ్ ఎడి చౌదరి, బిసి కార్పొరేషన్ ఈడి సుబ్రహ్మణ్యం, డిఎల్డిఓ ఓబులమ్మ, ఎల్డిఎం సత్యరాజ్, డిసిఓ ప్రభాకర్ రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.