Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

స్ట్రాంగ్ రూముల వద్ద స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌ల నియామకం

: జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర- అనంతపురం : సాధారణ ఎన్నికలలో భాగంగా నగరంలోని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల వద్ద సెక్టార్ అధికారులను స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌లుగా నియమించడం జరిగిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి (ఐఏఎస్) తెలిపారు. ఈ మేరకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 (సెంట్రల్ యాక్ట్ 2, 1974)లోని సెక్షన్ 21 కింద జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద 24/7 సెక్టార్ అధికారులను స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌లుగా నియమించామన్నారు. మూడు షిఫ్ట్ లలో ముగ్గురు సెక్టోరియల్ అధికారులను నియమించడం జరిగిందని, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హెచ్ఎన్ఎస్ఎస్ డిఈఈ డబ్ల్యూ.రాఘవేంద్రరావును, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ డీఈఈ సుభాష్ చంద్రబోస్ ని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అహుడా డిఈఈ రేవంత్ ను నియమించడం జరిగిందన్నారు. ప్రత్యేక కార్యనిర్వాహక మేజిస్ట్రేట్‌గా సెక్టార్ అధికారులు వ్యవహరిస్తారని తెలిపారు.
రాళ్లు, కర్రలు, ఇతర వస్తువులను అక్రమార్కులు అనధికారికంగా వినియోగించకుండా సి ఆర్ పీసీ సెక్షన్ 133(1)(సి ) కింద ఆదేశాలు జారీ :
చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు నిర్మాణ సామాగ్రి అయిన రాళ్లు, కర్రలు, ఇతర వస్తువులను అక్రమార్కులు అనధికారికంగా వినియోగించకుండా సి ఆర్ పి సి సెక్షన్ 133(1)(సి ) కింద జిల్లా జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ (ఐఏఎస్) ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాళ్లు, కర్రలు, రాడ్స్, ఇతర వస్తువులు చట్టపరమైన నిర్మాణ పనులకు మాత్రమే ఉపయోగించాలని, ఇది గనులు, భవన యజమానులకు వ్యక్తిగతమైన బాధ్యత అన్నారు. వ్యాపారపరంగా ఎటువంటి వాటికి రాళ్లు, కర్రలు, ఇతర వస్తువులను తరలించరాదన్నారు. ఎక్కడికైనా వాటిని పంపించినా, రవాణా చేసినా, నిల్వ ఉంచినా అది చట్టపరమైన పనులకు మాత్రమే వినియోగించాలని, అది గనులు, భవన యజమానుల బాధ్యత అన్నారు. పనులు చేసే కార్మికులను కూడా నిర్మాణ పనులకు మాత్రమే తీసుకోవాలని, వారు ఎటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనకుండా చూడాలన్నారు. పనులకు వచ్చేవారు ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీలలో పాల్గొనకూడదని, లా అండ్ ఆర్డర్ కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చుసుకోవాలన్నారు.
సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి జిల్లాలో నేర ప్రవృత్తి కలిగిన 8 మంది గూండాలు, మట్కా, జూదం ఆడే వారిని బహిష్కరించడం జరిగింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలవేళ ఇతర జిల్లాల నుంచి జిల్లాలోకి ఎవరు గొడవలు చేసేందుకు రావడానికి వీలు లేదని, ఇతర వ్యక్తులు ఎవరూ జిల్లాలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే పెట్రోల్ బంకులలో పెట్రోల్, డీజల్ ను వాహనాలకు మాత్రమే నింపాలని, బాటిళ్లకు, క్యాన్లలో ఎటువంటి పరిస్థితుల్లోనూ పోయరాదని సూచించారు. జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img