వర్కింగ్ ప్రెసిడెంట్ చట్ట రవి వర్ధన్
విశాలాంధ్ర- ధర్మవరం: పట్టణంలోని శాంతినగర్ లో ఇటీవల అప్పుల బాధ తాళలేక చేనేత కార్మికుడైన గంగాధర్ ఆత్మహత్యాయత్నం చేయడం జరిగింది. సమాచారాన్ని అందుకున్న జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలూరి రుషంగప్ప ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భుజంగరావు, నాగరాజు, సంఘ కార్యకర్తలు గంగాధర్లు చేనేత కార్మికుని నివాసంలో శనివారం కలిశారు. వారి ఆర్థిక పరిస్థితిని తాను అన్నివేళలా అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఆత్మహత్య చేసుకోవడం చాలా తప్పు పని అని తెలుపుతూ, కుటుంబం వీధిపాలు అయ్యే అవకాశం ఉందన్నారు. చేనేత సంఘం ద్వారా ముద్ర లోన్ అర్జీ కూడా పెట్టించడం జరిగింది అన్నారు. చేనేత కార్మికులకు జీవనోపాధి కరువు కావడం పెరిగిన ముడి సరుకుల ధరలకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేనేత కార్మికులు చేసుకోవడం బాధాకరమని, ఇందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని వారికి న్యాయం చేస్తూ ఆదుకోవలసిన బాధ్యత ఎంతైనా ఉందని వారు తెలిపారు.