విశాలాంధ్ర -ధర్మవరం : ధర్మవరం మండలం పోతుల నాగేపల్లి-కణం పల్లి గ్రామాల మధ్య చిత్రావతి నదిపై వరద ప్రవాహానికి రహదారి కొట్టుకుపోయి ఏళ్లు గడిచిన రాకపోకలకు ప్రజలు ఎంతో ఇబ్బందులు పడేవారు. కణంపల్లి నుంచి ధర్మారం రావాలంటే పోతుల నాగేపల్లి వద్ద చిత్రావతి నీటి ప్రవాహంలో దిగి రాకపోకలు అప్పట్లో చేసేవారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులపై వివిధ దినపత్రికల్లో కూడా కథనాలు రాసిన కూడా ప్రభుత్వం నుండి స్పందన కరువైంది. ఎట్టకేలకు ఆర్డిటి సంస్థ ముందుకు వచ్చి ఒక కోటి 50 లక్షల రూపాయలను ఖర్చు చేసి వంతెనను నిర్మించింది. ఈ వంతెన నిర్మాణం పెట్ల మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు మార్గం సుగమం కావడంతో వేలాది మందికి వంతెన ఉపయోగం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.