ఎమ్మెల్సీ అనురాధ, టిడిపి నాయకులు కందికుంట వెంకటప్రసాద్, నిమ్మల కిష్టప్ప
విశాలాంధ్ర – ధర్మవరం : ధర్మవరం పట్టు వ్యాపారస్తులైన కోటమానంద్ గిర్రాజు శశిధర్లపై విజయవాడకు చెందిన అవినాష్ గుప్తా వారి అనుచరులు దాడి చేయడం దారుణమని హేయమైన చర్య అని టిడిపి ఎమ్మెల్సీ అనురాధ, మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప, కదిరి టిడిపి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు సోమవారం బాధితుల కుటుంబాలకు వెళ్లి జరిగిన విషయాన్ని వారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి జరిగిన అవమానం పట్ల బాధను వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ దేశంలోనే ధర్మవరం పట్టుచీరలు ప్రసిద్ధిగాంచినవని, నమ్మకంతో దేశంలోని నగరాలకు చీరలు ఇస్తూ తమ వ్యాపారాలని కొనసాగించడం జరుగుతోందని, కానీ డబ్బు అడిగినప్పుడు ఇలా దాడి చేయడం చరిత్రలోనే లేదని, దాడి చేసిన వారి పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.