విశాలాంధ్ర- పెనుకొండ : నియోజకవర్గ కేంద్రంలోని మడకశిర రోడ్ లో ఉన్న మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి శనివారం రాష్ట్ర బ్రాహ్మణ అధ్యయన కమిటీ మెంబర్ సుదర్శన శర్మ వైయస్ రాజశేఖర్ రెడ్డి 74 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు రాజశేఖర్ రెడ్డి అమరహే అంటూ నినాదాలు చేశారు, ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి యొక్క సేవలను కొనియాడారు రాజశేఖర్ రెడ్డి జయంతి ని రైతు దినోత్సవం గా జరుపుకోవడం చాలా సంతోషమని ఆయన చేసిన సేవలను కొనియాడారు,జల ప్రదాత, పేదల పెన్నిధి ,ఆరోగ్య ప్రదాత,108,104, ప్రవేశపెట్టారని ఉన్నత విద్యకుఫీజులు రియంబర్స్మెంట్ పథకము, ఆరోగ్యశ్రీ, పక్కా గృహాల నిర్మాణం, ప్రజల మనిషిగా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేశారని బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని ఆయన బాటలో ఆయన కుమారుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పేదల పక్షాన నిలబడి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాడని ఆయన తెలిపారు.