విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తిక్ మంగళవారం ఎన్నికల సంవత్సరం 2024 స్పెషల్ సమ్మరి రివిజన్లో భాగంగా హౌస్ టూ హౌస్ సర్వే బూత్ లెవెల్ అధికారులు హౌస్ టూ హౌస్ వెళ్లి సర్వే చేసే భాగంలో జూలై 21 నుండి ఆగస్టు 21 వరకు సర్వే జరుగును అని తెలిపారు.ఈ సర్వే భాగంలో సబ్ కలెక్టర్ కార్తిక్ తహశీల్దారు స్వర్ణలత మున్సిపల్ కమిషనర్ వంశీ క్రిష్ణ భార్గవ, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ హనుమంతు, ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ గణేష్ కుమార్ హౌస్ టూ హౌస్ సర్వే ప్రత్యక్షంగా పర్యవేక్షించి పోలింగ్ స్టేషన్ నంబరు 151, 152, 153 డ 154 బి ఎల్. ఒ . లు ఎన్ని ఇల్లు తిరిగారు, యాప్ వర్క్ అవుతుందా లేదా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని క్షుణ్ణంగా సబ్ కలెక్టర్ కార్తిక్ అడిగి తెలుసుకొన్నారు. అలాగే పెనుకొండ లో ఉన్న అర్బన్ మరియు రూరల్ ఓటర్లు బి.ఎల్.ఓ లకు సహకరించాలి ప్రజలకు తెలియజేయడం జరిగింది అలాగే ప్రతి ఇంటిలో 18 ఏళ్లూ నిండిన ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును కల్పించాలని,ఓటరు జాబితాలో తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకొనే అవకాశం ఉంది అని మీ పరిధి లోని ప్రతి ఓటర్ కి తెలియ జేయలని మరియు మరణించిన వారి ఓట్లను తొలగించాలని తప్పులు లేని ఓటర్ జాబితాను తయారు చేసే బాధ్యత ప్రతి బి.ఎల్.ఓ దే అని తెలియజేశారు.అలాగే హౌస్ టూ హౌస్ ప్రోగ్రాం ను బి.ఎల్.ఓ లకు ఇచ్చిన సమయం లో పూర్తి చేయాలని మరియు విజయవంతం చేయాలని సబ్ కలెక్టర్ కార్తిక్ తెలియజేశారు ఆయనతోపాటు మండల విద్యాధికారులు చంద్రశేఖర్, సుధాకర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.