విశాలాంధ్ర,సీతానగరం : ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు, ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకునేందుకు భద్రతబలగాలు అందుబాటులో ఉంటాయని తెలియజేసేందుకు ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్వతీపురం గ్రామీణ సిఐ రవికుమార్ తెలిపారు. మండలంలోని అంటిపేట, చిన భోగిల గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం భద్రతా బలగాలఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.అన్నివీధులలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక పోలీస్ సిబ్బందితో పాటు భద్రతా బలగాలు ఉండి శాంతి భద్రతలు పర్యవేక్షణ చేస్తాయని చెప్పారు. మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో, పెద్ద గ్రామాల్లో భద్రతబలగాలు ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.ఈకార్యక్రమంలో స్థానిక ఎస్సై రాజేష్ పాల్గొన్నారు.