విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీపై తొలిసారిగా అనంతపురంలో వైద్య సదస్సు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోని సెమినార్ హాల్లో జరిగింది. న్యూరోసర్జరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనంతపురం మరియు ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల అనంతపురం, ఎస్టర్ సీఎం ఐ హాస్పిటల్ బెంగుళూరు సహకారంతో మినిమల్లీ ఇన్వాసివ్ స్పైన్ సర్జరీపై నిరంతర వైద్య విద్య సదస్సును నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్ణాటక నుంచి దాదాపు 150 మంది డాక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ, డాక్టర్ జి. భాస్కర్ మాట్లాడుతూ, చాలా మంది సీనియర్ స్పైన్ సర్జన్లు ఎంఐఎస్ సర్జరీలలో తాజా అప్ డేట్ లపై ప్రతినిధులతో సంభాషించి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. కోర్సు సమయంలో ఏకకాల కేసు చర్చలతో బోధనా షెడ్యూల్లో భాగంగా వివిధ ఎం ఐ ఎస్ శస్త్రచికిత్సలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా అనంత ఎమ్మెల్యే శ్రీ అనంత వెంకటరాంరెడ్డి మరియు కర్నూల్ లోని సీనియర్ న్యూరో సర్జన్ డబ్ల్యూ సీతారాం, హాజరయ్యారు.
ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎస్. మాణిఖ్యరావు మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న న్యూరోసర్జరీ విభాగము, ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇలాంటి సదస్సులు నిర్వహించడం గొప్ప ప్రయత్నమని, ఇంత మంచి కాన్ఫరెనన్ను విజయవంతంగా నిర్వహించినందుకు వైద్యుల బృందాన్ని అభినందించారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కెయస్ యస్ వెంకటేశ్వరరావు ఇలాంటి సదస్సు నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ న్యూరోసర్జరీ విభాగం, ఆర్థోపెడిక్స్ నిపుణుల బృందాన్ని అభినందించారు.