విశాలాంధ్ర-తాడిపత్రి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తు న్నాయని వాటిని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 16వ తేదీ నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు జీపు జాత నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్ చెప్పారు. పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లాలో శనివారము సిపిఐ నియోజక వర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు నల్ల ధనం వెలికి తీస్తానని, నిరుద్యోగులకు కోటి ఉద్యోగాలు ఇస్తానని ఇలా ఎన్నో వాగ్దానాలు చేసి అధికారం చేపట్టిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందన్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో బటన్ నొక్కి ప్రజల ఖాతాలోకి నగదు జమ చేస్తూనే ప్రజల వద్ద నుండి మద్యం, డీజిల్, పెట్రోల్, కరెంట్ బిల్లుల తదితర యాక్షల రూపంలో విచ్చలవిడిగా వసూలు చేస్తూ పేద ప్రజలపై భారం వేస్తూ ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ కట్టడానికి జీపు జాత నిర్వహిస్తున్నా మన్నారు. కావున గ్రామస్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు ప్రతి కార్యకర్త జీపు జాతను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి టి.రంగయ్య, కేశవరెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజారెడ్డి, పెద్దయ్య మండల కార్యదర్శి నాగ రంగయ్య రైతు సంఘం నాయకుడు నారాయణరెడ్డి పాల్గొన్నారు.