విశాలాంధ్ర – ఉరవకొండ : మండలంలో జగనన్న కాలనీలో ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టి 100% పూర్తి అయ్యేలా కృషి చేయాలని విడపనకల్లు ఎంపీపీ కరణం పుష్పవతి భీమ్ రెడ్డి, జెడ్పిటిసి హనుమంతు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పరిషత్ కార్యాలయంలో గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు,అధికారుల ఆధ్వర్యంలో గృహనిర్మాణానికి సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 18వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే గృహ ప్రవేశాలు కార్యక్రమంలో ఎక్కువమంది లబ్ధిదారులు గృహనిర్మాణాలు పూర్తి చేసి,గృహప్రవేశం చేసే విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు.లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే బిల్లులు విషయంలో కూడా అలసత్వం చేయకుండా వెంటనే లాగిన్లలో అప్రూవల్ ఇచ్చి,బిల్లులు త్వరగా పడే విధంగా చూడాలని తెలిపారు.మండల వ్యాప్తంగా దాదాపు 1800 మంజూరైతే 50 శాతం మాత్రమే పూర్తి అయ్యాయని,మిగతా 50 శాతం వివిధ దశలలో ఉన్నాయని అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో వివిధ దశలలో ఉన్న ఇండ్లను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ డిఇ హనుమన్న శ్రీనివాసులు,ఈవోఆర్డి సత్యబాబు,జేసిఎస్ మండల కన్వీనర్ భరత్ రెడ్డి,హౌసింగ్ ఏఈ అనిల్ కుమార్,వైఎస్ఆర్సిపి నాయకులు కరణం భీమిరెడ్డి,జిల్లా ఎస్సీ సెల్ నాయకులు సుంకన్న,సహకార సంఘం సొసైటీ చైర్మన్ శ్రీరాములు,కో-ఆప్షన్ మెంబర్ లతీఫ్,పంచాయతీ కార్యదర్శులు,ఇంజనీరింగ్ అసిస్టెంట్లు,సర్పంచులు,ఎంపీటీసీలు,తదితరులు పాల్గొన్నారు.