ది విశాఖ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ బ్రాంచ్ ఇంచార్జ్ డైరెక్టర్ జి వి సత్యనారాయణ మూర్తి విశాలాంధ్ర అనంతపురం సహకారం ఒక జీవన విధానం గా నమ్ముతున్నదని ఒకరి కోసం అందరూ అందరి కోసం ప్రతి ఒక్కరు అనే నినాదంతో ది విశాఖ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క కార్యక్రమాలను సభ్యులకు వివరంగా తెలియజేస్తున్న ఏకైక కో-ఆపరేటివ్ బ్యాంక్ అని ది విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ ఇన్చార్జి డైరెక్టర్ జె.వి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో 2023- 24 అనంతపురం బ్రాంచ్ సభ్యుల మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ది విశాఖ కో-ఆపరేటివ్ అనంతపురం బ్రాంచ్ ఇంచార్జ్ డైరెక్టర్ పి.నారాయణస్వామి అధ్యక్షత వహించగా, ఇన్చార్జి డైరెక్టర్ జె.వి సత్యనారాయణమూర్తి, బ్రాంచ్ మేనేజర్ తట్టుపర్తి ఉదయ్ కృష్ణ సురేష్, జోనల్ మేనేజర్ హైదరాబాద్ జోన్ పి. ప్రసాద్ రావు, గుత్తి బ్రాంచ్ ది విశాఖ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ జిలాన్ భాష పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అనంతపూర్ లో ది విశాఖ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఫిబ్రవరి 12, 2017 లో ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రస్తుతం కోపరేటివ్ సభ్యులుగా 549 మంది ఉన్నారన్నారు. డిపాజిట్లు 6.41కోట్లు, రుణాలు 33.56 కోట్లు, షేర్ దానం 1.03 కోట్లు, నిరార్ధక ఆస్తులు 0.41 ఉందన్నారు. రాబోవు కాలంలో డిపాజిట్లను మరింత పెంచే దిశగా పని చేయాలన్నారు. బ్యాంక్ సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు దేశంలోని ఏ సహకార బ్యాంకు లోను అమలు చేయని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. విద్యలో ప్రతిభ కనబరిచిన సభ్యుల పిల్లలకు నగదు పురస్కారాలు ఇవ్వడమే కాకుండా వారికి తక్కువ వడ్డీ పై విద్య రుణాలు అందిస్తున్నామన్నారు. డిపాజిట్లపై జాతీయ వాణిజ్య బ్యాంకులు కన్నా అధిక వడ్డీ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 50 శాఖల సభ్యులతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. బ్యాంక్ అభివృద్ధికి , సేవలు విస్తారనకు సహకరిస్తున్న సభ్యులకు, ఖాతాదారులకు, న్యాయ సలహాదారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం బ్రాంచ్ కోఆపరేటివ్ అధికారులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.