విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశ హాలులో ఈనెల 30వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు సాధారణ కౌన్సిల్ సమావేశమును నిర్వహించబడునని మున్సిపల్ చైర్పర్సన్ కా చర్ల లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అజెండాలోని 45 అంశాలపై కౌన్సిలర్లతో చర్చించి ఆమోదం తెలపడం జరుగుతుందనీ, అదేవిధంగా వార్డులలో గల సమస్యలపై గతంలో ఇచ్చిన ఫిర్యాదుల యొక్క ప్రగతి నివేదిక కూడా చర్చించబడునని తెలిపారు. తదుపరి మున్సిపల్ వైస్ చైర్మన్-1 ఎర్రగుంట భాగ్యలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్-2 పెనుజూరు నాగరాజు ల యొక్క రాజీనామా ఆమోదం తెలుపుట, వార్డులలో వివిధ అభివృద్ధి పనులపై సమీక్షను నిర్వహించుట జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వార్డు ప్రజలకు చేరుతున్నాయా? లేదా?, సమస్యల ను పరిష్కరించుటలో అధికారుల పనితనమును వేగవంతం చేయించుట, తాగునీరు, వీధి దీపాలు, పట్టణ పరిశుభ్రత, తదితర అంశాలపై కూడా చర్చించడం జరుగుతుందన్నారు. కావున కౌన్సిలర్లు, కో ఆప్షన్ నెంబర్లు అందరూ కూడా సకాలంలో సమావేశానికి హాజరు కావాలని వారు కోరారు.