రంగస్వామి
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని 39 వ వార్డు రాంనగర్లో మంగళవారం రాత్రి నీళ్లూరి పుల్లమ్మ అనే మహిళ ఇంట్లో నిద్రిస్తుండగా పాముకాటు వేయడంతో మృతి చెందింది. సమాచారం అందుకున్న అవార్డు కౌన్సిలర్ కడప రంగస్వామి అంతక్రియల కోసం తన వంతుగా 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ పుల్లమ్మ మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని లోటు అని, కుటుంబానికి మున్ముందు అండదండలుగా ఉంటామని తెలిపారు.