విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ తాసిల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం సిపిఐ డివిజన్ కార్యదర్శి శ్రీ రాముల నేతృత్వంలో సిపిఐ నాయకులతో కలసి ధర్నా చేస్తూ నినాదాలు చేశారు మణిపూర్ లో మానవ హక్కులు కాలరాస్తున్నాయని అనేక హింసాత్మక దాడులు సంఘటనలు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వము అక్కడ రాష్ట్ర ప్రభుత్వము నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్న వల్ల భారతదేశ పరువు మర్యాదలు మంట కలిసి ఎంతోమంది అక్కడ వికృత చేష్టలను చూసి ఆత్మహత్యలు చేసుకోవడం మహిళలకు వివస్త్రాలను చేసి ఊరేగించడం జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వము అక్కడి ప్రజలకు రక్షణ కల్పించకుండా చోద్యం చూస్తున్నదని కావున దీనిపై రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం స్పందించి అక్కడ జరుగుతున్న పరిణామాలను అరికట్టాలని శాంతియుత వాతావరణ మేలుకొల్పాలని సిపిఐ నాయకులు కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయంలో నోరు విపకపోవడం దురదృష్టకరమైన విషయం అని భారత దేశంలో మహిళలను ఎంతో గౌరవప్రదంగా చూస్తున్న దేశంలో మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించడం అనేక ఇబ్బందులకు గురి చేయడం కొంతమంది ప్రజలు గిరిజనులపై తెగబడి మానవీయ కోణాన్ని దాటి వ్యవహరిస్తున్నందున తీవ్రంగా ఖండిస్తున్నామని శ్రీరాములు తెలుపుతూ అనంతరం డిమాండ్లపై మణిపూర్ సంఘటనపై తాసిల్దార్ సువర్ణకు వినతి పత్రాన్ని సమర్పించారు,ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి నరసింహ, పట్టణ కార్యదర్శి వెంకటేషులు, ఏఐటీయూసీ నాయకులకు కిష్టప్ప, వెంకటరాముడు, జాఫర్ మహిళా నాయకురాలు పాల్గొన్నారు.