శ్రీ సత్య సాయి జిల్లా సేవాసమితి నిర్వాహకులు
విశాలాంధ్ర ధర్మవరం:: పుట్టపర్తి సాయిబాబా 98వ జన్మదిన వేడుకల సందర్భంగా ఇటీవల వ్యాసర వ్యాసరచన పోటీలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఈ జిల్లా వ్యాప్తంగా ప్రతిభ చాటిన విద్యార్థుల యొక్క ఫలితాల జాబితాను వెలువడించారు. ఇందులో భాగంగా ఆదివారం పుట్టపర్తిలో ధర్మవరం సమితి ఆధ్వర్యంలో 57 పాఠశాలలు పాల్గొన్నాయి. ఇందులో బత్తలపల్లి విద్యా జ్యోతి స్కూలుకు చెందిన జి నవ్యశ్రీ కి స్టేట్ వైడ్ బ్రాంచ్ మెడలు ప్రధానం చేశారు. జిల్లా వారిగా బహుమతి ప్రధానోత్సవం లో శ్రీ సత్య కృప డిగ్రీ కాలేజీ కు చెందిన సాయి కీర్తి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో రెండవ బహుమతి సాధించగా, జే .అయిషా తెలుగు లాంగ్వేజ్ లో రెండవ బహుమతిని సాధించింది. తదుపరి బాలవికాస్ వ్యాసరచన పోటీల్లో ధర్మవరం మార్కెట్ వీధిలో ఉన్న ప్రణవసాయి స్కూల్ విద్యార్థులు పి. జాహ్నవి, ఎస్. ఐసా కౌసర్, డి.మీనాక్షి, డి. హర్షిత రెడ్డి కాగా, జీవన స్కూల్ నుండి ఎస్. వజ్ర సింధూరికా మొత్తము ఎనిమిది మంది విద్యార్థులు ప్రశంసా పత్రములు మరియు మెమొంటోలను కైవసం చేసుకోవడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని శ్రీ సత్య సాయి సేవా సమితి నిర్వాహకులు, తల్లిదండ్రులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.