విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : గోవా వేదికగా ఈనెల 9 నుండీ 13 వ తేదీ వరకు 22 వ జాతీయ స్థాయి పారా అథ్లెటిక్స్ ఛాంపియన్సిప్ -2024 నిర్వహించారు. ఈ ఛాంపియన్సిప్ పోటీలలో అనంతపురం జిల్లా నుండీ నలుగురు క్రీడాకారులు పాల్గొన్నారు… ఒకటి బంగారు, రెండు సిల్వర్ పతకాలు జిల్లాకు దక్కాయి. జిల్లాకు చెందిన సాకే బాబుకు ఎఫ్ 56 షౌట్ పుట్ లో బంగారు పతకం… నీలం పల్లవి మరియు నీలం సంజీవరెడ్డిలకు చెరో సిల్వర్ పతకాలు దక్కించుకున్నారు. పతకాలు సాధించిన ఈ ముగ్గుర్ని ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ డి.పి.ఓ లోని తన ఛేంబర్లో సత్కరించి సాధించిన పతకాలను మెడలో వేశారు. ఈకార్యక్రమంలో నాగరాజు, శ్రీనివాసులు మరియు సాప్ కోచ్ మంజుల పాల్గొన్నారు.