జనసేన ఇంచార్జి సాకే పవన్ కుమార్
విశాలాంధ్ర-రాప్తాడు : వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కేటాయించగలరా అని జనసేన రాప్తాడు ఇంచార్జి సాకే పవన్ కుమార్ సీఎం జగన్ ను ప్రశ్నించారు. బుధవారం ఆయన రాప్తాడులో విలేకరులతో మాట్లాడారు.
సీఎం జగన్ నిత్యం పలికే సామాజిక న్యాయం అనే పదానికి వైసీపీ హయాంలో చోటే లేదన్నారు. బీసీలకు ఏమి ఉద్ధరించారని రాప్తాడులో సిద్ధం సభకు వస్తున్నారని నిలదీశారు. రాప్తాడు నియోజకవర్గంలో 70శాతం బీసీలున్నారనే ఉద్దేశ్యంతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో వాల్మీకి సామాజిక వర్గానికి తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చి సామాజిక న్యాయాన్ని పాటించారన్నారు.
రాష్ట్రంలో 70శాతం బీసీలున్న నియోజకవర్గాల్లో ఆ సామాజిక వర్గానికే ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలన్నారు. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు జగన్ హయాంలో సరైన న్యాయం జరగలేదన్నారు. నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీలని మాట్లాడుతున్నారే తప్ప వారి మనోభావాలను, బాధలను ఏనాడూ విన్నారో చెప్పాలన్నారు.