ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలంలో నిర్మిస్తున్న జిల్లేడు బండ రిజర్వాయర్ పై అనవసరంగా ప్రతిపక్షాలు బురద చెలుతున్నారని, ఆ తప్పుడు ఆరోపణలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లేడు బండ రిజర్వాయర్ రూ.680 కోట్లతో 2.41 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నామని, ఇందుకుగాను ముదుగుబ్బ మండలంలోని చాగపురము, గుంజేపల్లి, మంగళ మడక, బుక్కపట్నం మండలంలోని కృష్ణాపురం, మారాల గ్రామాల రైతులకు చెందిన 1738 ఎకరాల భూమిని భూసేకరణ చేయాల్సి వస్తుందన్నారు. దీనివల్ల 23,000 ఎకరాల కొత్త ఆయుకట్టుకు సాగునీరు అందించవచ్చునని తెలిపారు. అంతేకాకుండా ధర్మవరం, కదిరి నియోజకవర్గాలకు త్రాగునీరులు కూడా అందించే అవకాశం ఉందని తెలిపారు. రైతులకు ఆమోదయ యోగ్యమైన నష్టపరిహారం అందిస్తామని తప్పుడు వార్తలను నమ్మవద్దని రైతులకు అండగా తాను ఎప్పుడూ ఉంటానని వారు హామీ ఇచ్చారు.