విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ గా శుక్రవారం డాక్టర్ నజీర్ పదవీ బాధ్యతలను చేపట్టారు. గతంలో ఉన్న పద్మలత కొన్ని అనివార్య కారణాల వలన సూపర్డెంట్ గా తాను కొనసాగించలేనని జిల్లా అధికారులకు తెలపడంతో, జిల్లా అధికారులు డాక్టర్ నజీర్ కు ఫుల్ అడిషనల్ చార్జ్ సూపర్డెంట్ గా ఉత్తర్వులు అందాయి. ఈ సందర్భంగా పద్మ లత తో పాటు ఆసుపత్రి వైద్యులు, హెడ్ నర్సులు, నర్సులు, కార్యాలయ విభాగపు అధికారులు, సిబ్బంది కలసి నజీర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డాక్టర్ నజీర్ మాట్లాడుతూ ఆసుపత్రి లోని వైద్యులు తదితర విభాగపు అధికారులు సిబ్బంది యొక్క సహాయ సహకారాలతో తన వంతుగా ఆసుపత్రి అభివృద్ధి కొరకు కృషి చేస్తూ, రోగులకు అన్నివేళలా వైద్య చికిత్సలను అందించగలరని వారు తెలిపారు. నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వ్యాధులకు నిష్ణాతులైన వైద్యులు ఉన్నారని, పట్టణ గ్రామీణ ప్రజలు గుర్తించి వైద్య చికిత్సలను పొంది తమ ఆరోగ్యమును కాపాడుకోవాల్సినదిగా వారు కోరారు.