విశాలాంధ్ర -అనంతపురం : జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాలతో జిల్లాలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును డీఎస్పీలు సమీక్షించారు. అనంతపురం రూరల్ డీఎస్పీ రాప్తాడు మండలం ఎం.బండమీదపల్లి, యర్రగుంట, గొందిరెడ్డిపల్లి పోలింగ్ కేంద్రాలను… గుంతకల్లు డీఎస్పీ జి.విజయభాస్కర్ రెడ్డి కసాపురం పోలీసు స్టేషన్ పరిధిలోని ర్వేపల్లి రాధాకృష్ణ హైస్కూలు పోలింగ్ కేంద్రానికి వేర్వేరుగా వెళ్లారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు చేపట్టిన బందోబస్తు, ఓటర్వ క్యూ నిర్వహణ, 100 మీటర్లు, 200 మీటర్ల పరిధులను మరియు తీసుకున్న చర్యలను సమీక్షించారు.