విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ మండలం దుర్గాశక్తి సొసైటి ఆఫీస్ ప్రాంగణం లో సోమవారం12 వ వార్షిక మహాసభ ఘనం గా నిర్వహించడం జరిగింది.సొసైటి అధ్యక్షురాలు .ముంతాజ్ సొసైటి కార్యనిర్వహణ అధికారి కవిత ఆధ్వర్యం లో 530 మందితో సభ నిర్వహించడం జరిగింది.దుర్గాశక్తి సొసైటి రెండు మండలాలలో 78 గ్రామాలు ,౩౩8 సంఘాలు 7982 మంది సభ్యులతో 10.59 కోట్ల టర్నోవర్ తో జరుగుతుంది.ఈ సభ కు ముఖ్య అతిధి గా టింబక్టు కలెక్టివ్ సంస్థ వ్యవస్తాపకులు సి కె గంగూలి, పాల్గొని మహిళల ఉద్దేశించి ప్రసంగించారు మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని మహిళలు నిర్ణయాధికారము దిశగా అడుగులు వేయాలని మరింత చైతన్యవంతులుగా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని ఆర్థిక స్వసంత్రం వచ్చినప్పుడు మహిళలు అన్ని రంగాలలోనూ ఎదగటానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు ప్రోగ్రాం మేనేజర్స్ సుకన్య ,రమేష్ ,విభ ,మహాశక్తి సమాఖ్య నుండి రమీజ,అశ్విని,గౌరి సభ్య సొసైటి లుపాలకవర్గం,సిబ్బంది పాల్గొనడంజరిగింది.మహిళలు సాంస్కృతిక కార్యక్రమాలు చెక్కల భజన ,ఆట పాటలతో విజయవంతంగా ముగించడం జరిగింది.