విశాలాంధ్ర – ధర్మవరం : తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని త్యాగరాయ గాన సభ యందు”శ్రీ తాళ్లపాక అన్నమాచార్య 616 జయంతి వేడుకలు సందర్భంగా శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని మానస నృత్య కళా కేంద్రం శిష్య బృందం ఆలపించిన సంగీత నృత్య ఉత్సవ కార్యక్రమం అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా గురువు ఆర్. మానస మాట్లాడుతూ అన్నమాచార్య జయంతి వేడుకలకు మమ్ములను ఆహ్వానించి మా శిష్య బృందంచే నాట్యం చేయించడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. తన చిన్న వయసు నుంచే నృత్యం పట్ల ఆసక్తిగా ఉన్నానని, వందల మంది విద్యార్థులకు ఈ నృత్య కళను నేర్పడం జరుగుతోందని తెలిపారు. ఈ త్యాగరాయ గాన సభలో మానస శిష్య బృందం లో సాహిత్య శేఖర్-ఒకపరి కొకపరి, రు త్విక-అదివో అల్లదివో, మాన్విక-వచ్చెను అలమేలుమంగ అను నృత్యాలను చేయడం జరిగిందన్నారు. ప్రేక్షకుల యొక్క హర్షద్వనాలు మమ్ములను ఎంతగానో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన త్యాగరాయ గాన సభ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శిష్య బృందమును, గురువు మానసను, త్యాగరాయ గాన సభ వారు ఘనంగా సత్కరించి మెమొంటోలను పంపిణీ చేశారు.