దిష్టిబొమ్మ దహనంతో పాటు రాస్తారోకో
విశాలాంధ్ర- తనకల్లు : మణిపూర్ లో విఫలమైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు నిరసనగా మండలం కేంద్రంలోని జాతీయ రహదారిపై సిపిఐ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్నం చేసి రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ కార్యదర్శి రెడ్డప్ప సిపిఐ సీనియర్ నాయకులు నరసింహులు ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఇక్బాల్ మాట్లాడుతూ మణిపూర్ లో కుకీ జాతికి చెందిన గిరిజన మహిళలపై గత రెండు నెలల నుండి జరుగుతున్న వికృత అవమానియా మానవ హక్కుల ఉల్లంఘన చర్యలైన మహిళలపై అత్యాచారాలు హత్యలు నగ్న ఊరేగింపులు చేయడం చాలా దారుణమైన ఘటనని తెలియజేశారు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన ఇప్పటికీ మహిళలపై బట్టలు లేకుండా నడిరోడ్డుపై తరుముకుంటూ అత్యాచారాలు చేయడం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా మహిళలపై ఇటువంటి దాడులు అనేకమవుతున్నాయి దాడి చేసిన వారిని బహిరంగంగా ఉరితీయాలని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని మహిళలకు అన్ని విధాల రక్షణ కల్పించాలి మనం భారతదేశం లోనే ఉన్నాము అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది మానవ సమాజానికే మాయని మచ్చ మణిపూర్ ముఖ్యమంత్రి బీరన్ సింగ్ అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లకు ప్రోత్సహిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అసమర్థుడైన ముఖ్యమంత్రిగా ఇతను ముఖ్యమంత్రి పదవి వెంటనే రాజీనామా చేయాలి అలాగే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అమీషా భేషరతుగా రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు వెంటనే రాష్ట్రపతి జోక్యం చేసుకొని రాష్ట్రపతి పాలన కొనసాగించాలి లేనిపక్షంలో సిపిఐ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు చౌడప్ప యాదవ్ ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి కరీముల్లా గిరిజన సంఘం రవి నాయక్ నాయకులు శ్రీనివాసులు రెడ్డప్ప చౌడప్ప శీన ప్రజానాట్యమండలి రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు