టిడిపి అధినేత చంద్రబాబు అవకాశవాది…
సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : గత ఖరీఫ్ లో అనంత జిల్లాలో 31 మండలాలు గాను 28 మండలాలు కరువు ప్రకటించడం జరిగిందని రైతాంగాన్ని ఆదుకోలేని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓడించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్ పిలుపునిచ్చారు. స్థానిక కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల మరణాలు, వలసలు, ఎండిపోతున్నటి పంటలను చూస్తూ కూడా ఆదుకోలేదన్నారు. కరువు సహాయక చర్యలు చేపట్టాలని ఉద్యమం చేస్తున్న వారిపై కేసులు పెట్టడం జరిగిందన్నారు. రబిలో 14 మండలాలు కరువుగా ప్రకటించిన జరిగిందన్నారు. నిన్నటి రోజున తాడిపత్రి, పెద్దవడుగూరు, కూడేరు మండలాలకు సంబంధించి చుక్కలూరు, ముచ్చుకోట, కూడేరు మండలాలకు సంబంధించిన రైతులు తమ పొలంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు. పిసిసి చీఫ్ షర్మిల రెడ్డి, డాక్టర్ సునీత, వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో ఏ విధంగా పాల్గొంటారని ప్రశ్నించడం జరిగిందన్నారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పి ప్రజలను ఓటు అడగాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఇసుక, మద్యం, మట్టి , మాఫియా దోచుకుంటూ,ప్రజల పన్నుల తో 10 శాతం అభివృద్ధి చేస్తూ 90 శాతం నిధులను దోపిడీ చేశారన్నారు. తెలుగుదేశం, బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి చూస్తుంటే చంద్రబాబు నాయుడు అవకాశవాది అని పేర్కొన్నారు. 10 అసెంబ్లీ స్థానాలు 6 పార్లమెంట్ స్థానాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అవకాశవాదుల పార్టీ అయినటువంటి ఎన్ డి ఏ పార్టీలను ఓడించాలన్నారు. దేశంలో ఇండియా కూటమి తరుపున కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ముస్లిం లీగ్ పార్టీలను ఆదరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి పి. నారాయణస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు సి. లింగమయ్య, రాప్తాడు నియోజకవర్గం సభ్యులు పి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.