విశాలాంధ్ర – తనకల్లు : పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉన్నందున వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వరాదని నిబంధనను ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు వారి వద్ద నుండి సెల్ఫోన్లో ట్యాబులు స్వాధీనం చేసుకుని ప్రత్యామ్నాయంగా సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పించి లబ్ధిదారులకు ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చేలా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో తెదేపా మండల కన్వీనర్ రెడ్డి శేఖర్ రెడ్డి నాయకులు వార్డ్ మెంబర్ దామోదర పీజీ మల్లికార్జున మాజీ ఎంపిటిసి రెడ్డప్ప రెడ్డి అరటికాయలు రవి శ్రీరాముల నాయక్ మహిళా కన్వీనర్ తోట సరోజమ్మ తదితరులు పాల్గొన్నారు