Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది

పరిటాల శ్రీరామ్

విశాలాంధ్ర – ధర్మవరం : భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా బుధవారం వారు 37వ వార్డులో ఇంటింటా తిరుగుతూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టో యొక్క కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం టిడిపి చేపట్టిన కార్యక్రమాల యొక్క ప్రగతి ఎలా ఉంటుందో కూడా తెలియజేశారు. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ధర్మవరంలో అరాచకాలకు, బెదిరింపులకు, అడ్డుపడాలంటే తప్పనిసరిగా ధర్మవరం నియోజకవర్గంలో టిడిపి అధికారంలోకి రావాలని వారు తెలిపారు. తొలుత కొత్తపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పరిటాల శ్రీరామ్ స్థానిక నాయకులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. సూపర్ సిక్స్ పేరుతో ఆరు పథకాలను అన్ని వర్గాల కోసం తీసుకువచ్చారని ప్రజలకు వివరించారు. మహిళలు, నిరుద్యోగులను, రైతులను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాలను చంద్రబాబు నాయుడు తీసుకురావడం జరిగిందని తప్పనిసరిగా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు వైసిపి ప్రభుత్వంతో విసుగు చెందారని, త్వరలో టిడిపికి పట్టం కట్టనున్నారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే,అక్రమ కేసులను బనాయించడమే కాకుండా, సంక్షేమ పథకాలు కూడా తొలగించడం ఎంతవరకు సమంజసమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పని కుమార్, పురుషోత్తం గౌడ్, కమతం కాటమయ్య, ఓం ప్రకాష్, కొత్తపేట ఆది, వాసుదేవ్, అమర్, బిల్లే రామకృష్ణ, ఇజ్రాయిల్, అంబటి సనత్, కృష్ణాపురం జమీర్ అహ్మద్, మారుతి స్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img