విశాలాంధ్ర – కర్నూలు సిటీ : కర్నూలు నగరంలో బి. క్యాంపులోని బిసి భవన్ లో సోమవారం జాతీయ మత్స్యకారుల సంఘము ఆధ్వర్యంలో ఘనంగ వేదవ్యాస జయంతి వేడుకలు నిర్వహించారు.నగర అధ్యక్షులు గ్యాస్ శ్రీనివాసులు, నగర ప్రధాన కార్యదర్శి ఎద్దుల వెంకటేష్, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, కార్యదర్శులు భాస్కర్, కమలమ్మ, ట్రెజరర్ గోపాల్ రాజా, సహాయ కార్యదర్శి నందకిషోర్, పి. వెంకటేశ్వర్లు,కన్నాలు వేద వ్యాస చిత్రపటానికి పూలమాలల వేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆషాడ సిద్ద పౌర్ణమి సోమవారం రోజున వ్యాస మహర్షి జన్మించిన రోజని, గురుపౌర్ణమి, మహా భారతం, బాగవతలతో పాటు అష్టదశ పురాణాలు సైతం వ్యాసభగవానుడు అందించారన్నారు. వేదాలను నాలుగు భాగాలుగ చేశారని,అందుకే వేదవ్యాసుడని పేరు వచ్చిందన్నారు. వ్యాసుని పుట్టినరోజు గురు పౌర్ణమి జరుపుకుంటారని,ఈ రోజును వ్యాసపూర్ణిమగ కూడా పిలుస్తారన్నారు. వ్యాసభగవానుడు గంగపుత్ర పురాణ పురుషుడని, ఆ వేదవ్యాస మహర్షి జయంతిని జరుపుకోవటం అదృష్టంగా భావిస్తామని వారు తెలిపారు.