Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకునే రోజులు పోయాయి

.అరాచకం రాజ్యమేలుతుంటే.. ప్రతిఘటన కచ్చితంగా ఉంటుంది
. ధర్మవరం నియోజకవర్గ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ హెచ్చరిక


విశాలాంధ్ర – ధర్మవరం : పుంగనూరు ఘటనపై ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి అని,మీరు దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకునే రోజులు పోయాయని.. మీరు చేసే ప్రతి దానికి ప్రతిచర్య టీడీపీ వైపు నుంచి ఉంటుందని ధర్మవరం నియోజకవర్గ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా శనివారం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన పార్టీ నేతలతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పుంగనూరు, అంగళ్లులో జరిగిన సంఘటనల మీద శ్రీరామ్ తీవ్రంగా స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పర్యటనలకు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక వైసీపీ కుట్రలు చేయడమే కాకుండా దాడులకు కూడా పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రాజెక్టుల దుస్థితిని ప్రజలకు చెప్పాలన్న మంచి ఉద్దేశ్యంతో చంద్రబాబు యాత్ర చేస్తుంటే.. దానిని అడ్డుకునేందుకు దాడులకు తెరలేపారన్నారు. పులివెందులలోనే ఇలాంటి దాడులకు ప్రయత్నించారని.. అక్కడికి వచ్చిన అశేష జనవాహిని వైసీపీ శ్రేణులను తిప్పికొట్టిందన్నారు. దానిని మనసులో పెట్టుకుని పుంగనూరులో ఉద్దేశ్య పూర్వకంగా టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డారన్నారు. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి పై రాళ్ల దాడికి తెగిస్తున్నారని.. ఇక చూస్తూ ఊరుకునేందుకు మేము చేతకాని వాళ్లం కాదని శ్రీరామ్ హెచ్చరించారు. భగద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పాడని.. అరాచకం రాజ్యమేలుతుంటే చేతులు ముడుచుకుని కూర్చోవడం సరికాదని.. అందుకే ధర్మ యుద్ధానికి టీడీపీ దిగిందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కేటనని కత్తికి ఒకవైపు పదను ఉండదని.. రెండవ వైపు కూడా పదును ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య, నాయకులు పురుషోత్తం గౌడ్, గోనుగుంట్ల విజయ్ కుమార్, పని కుమార్, పరిసే సుధాకర్, మాజీ జడ్పిటిసి రామాంజనేయులు, మాజీ ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి, పని కుమార్ , మారుతి సామీ, అంబటి సనత్, కృష్ణాపురం జమీర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img